నాగార్జున రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో 2016 లో కళ్యాణ్ కృష్ణకురసాల దర్శకత్వంలో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన సినిమా ఎంతటి అద్భుతమైన విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ చిత్రంగా బంగార్రాజు చిత్రాన్ని తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే.ఇందులో నాగార్జున రమ్య కృష్ణతో పాటు నాగ చైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాలా…వద్దా అనే సందిగ్ధంలో ఉండేది.
ఇక సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా చిత్రాలు విడుదలకు సిద్ధం కావడంతో ఈ సినిమా విడుదల గురించి ప్రకటించలేదు.
అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రాలు వాయిదా పడటంతో ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే నాగార్జున బంగార్రాజు చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.
ఇలా సంక్రాంతికి వస్తున్న బంగార్రాజు సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ 12 కోట్లు సీడెడ్ ప్రాంతంలో ఐదు కోట్లు రేషియో వచ్చినట్టు తెలుస్తోంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో బంగార్రాజు సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 25 కోట్ల రూపాయలు దాటినట్లు తెలుస్తోంది.ఇక ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ ఇండస్ట్రీ మధ్య టిక్కెట్ల ధరల పై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
చర్చల అనంతరం సినిమా ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తే మాత్రం బంగార్రాజు సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.మొత్తానికి బంగార్రాజు ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఈ రేంజిలో జరిగితే సినిమా కూడా మంచి హిట్ అందుకుంటుందని తెలుస్తోంది.