హైదరాబాద్ బిర్యానీకి చాల ఫేమస్.అసలు బిర్యానీ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు.
ఇక చాలమందికి బిర్యానీ పేరు చెబుతూనే నోట్లో నీళ్లు ఊరుతాయి.మనం ఇంట్లో ఎంత మంచిగా బిర్యానీ చేసిన రెస్టారెంట్ రుచి మాత్రం రాదు.
ఇక కరోనా రావడంతో బిర్యానీ ప్రియుల బాధ వర్ణణాతీతం.దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.
ఈ క్లిష్ట సమయంలో ప్రజలను ఈ మహమ్మారి బారి నుండి కాపాడేందుకు దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే.లాక్ డౌన్ కారణంగా రెస్టారెంట్లు మూతబడిన సంగతి అందరికి తెలిసిందే.
తాజాగా లాక్ డౌన్ సడలింపులతో రెస్టారెంట్లుకు అనుమతి లభించింది.అయితే కరోనా కారణంగా ఇక చాల మంది రెస్టారెంట్లకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు.అయితే ఇక్కడ కట్టిన క్యూ చూస్తే మాత్రం ఎవరికీ కరోనా అనే భయం కాదుకదా.కరోనా అసలు వచ్చిందా అనే ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది.
అయితే కరోనా రాక ముందు ప్రజలల్లో ఓపిక అనేది చాల తక్కువ.అయితే ఒక్క విధంగా చెప్పాలంటే కరోనా ప్రజలల్లో ఓపికను కూడా తీసుకోని వచ్చింది.
ఇక చాల మంది బిర్యానీ కోసం ఎంతో ఓపిగ్గా క్యూలో నిల్చున్నారు.ఈ ‘క్యూ’ని ఒకసారి చూస్తే షాక్ అవుతున్నారు.
ఇక 90 సెకండ్లపాటు ఉన్న ఈ వీడియోలో క్యూ పెరుగుతూనే ఉంది.ఇక బెంగళూరులోని హోస్కోట్ వద్ద బిర్యానీ కోసం క్యూ కట్టారు.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక క్యూలో నిలబడిన వారు మాస్కులు ధరించలేదు.