హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మీడియాలో పోసాని కృష్ణ మురళి మెగాఫ్యామిలీపై తీవ్రస్థాయిలో మండిపడిన్న సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ కావాలని తన అభిమానులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ తన ఇంటిలో ఉన్న ఆడవాళ్లపై విమర్శలు చేస్తున్నట్లు పోసాని రెచ్చిపోయారు.
ఏకంగా తన భార్య పై పచ్చి బూతులు మెసేజ్ లు ద్వారా పంపిస్తున్నారని, మీడియా సముఖంగా పోసాని సీరియస్ అయ్యారు.ఆ తరువాత చిరంజీవి ఫ్యామిలీ పై.వాళ్ళ తల్లి పై వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పై పోసాని ఘాటుగా కామెంట్లు చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో మా అధ్యక్ష ఎన్నికల నామినేషన్ కి ముందు.
ఒక్కసారిగా తన నిర్ణయం మార్చుకున్న బండ్లగణేష్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో పోసాని వ్యాఖ్యలను బండ్లగణేష్ ఖండించారు.
పవన్ కళ్యాణ్ ని విమర్శించిన పర్లేదు గాని, చిరంజీవి గారి తల్లి పై విమర్శలు చేయడం దారుణమని చెప్పుకొచ్చారు.ఆవిడ కానీ నా సంతానం వల్ల ఇండస్ట్రీలో చాలామంది బతుకుతున్నారని, పోసాని భార్య తన తల్లితో సమానమని.
అయినా సరే మెగా ఫ్యామిలీ ఆడవాళ్లపై చిరంజీవి గారి తల్లి పై పోసాని చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని చెప్పుకొచ్చారు.పోసాని ఇలాంటి వాళ్ల గురించి మాట్లాడి తన స్థాయి తగ్గించుకోను అని అన్నారు.
ఆయన ఎక్స్ పైర్ అయిపోయిన టాబ్లెట్ లాంటివారు అంటూ బండ్ల గణేష్ తనదైనశైలిలో వ్యాఖ్యలు చేశారు.