పార్టీ స్థాపించి చాలా కాలం అయినా, జనసేన కు మాత్రం రాజకీయంగా పరిస్థితులు కలిసి రావడం లేదు.అసలు జనసేన చేసే కార్యక్రమాలు ఏవి పెద్దగా జనాల్లోకి వెళ్లడం లేదు.
కేవలం సోషల్ మీడియా ద్వారా జనసేన నాయకులు పవన్ ఫ్యాన్స్ మాత్రమే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున న్యూస్ చానల్స్ ఉన్నా, అందులో మెజారిటీ చానల్స్ టిడిపి అనుకూల ఛానల్స్ గా ముద్రపడగా మరికొన్ని చానల్స్ వైసిపికి అనుకూలంగా ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.
దీంతో జనసేనకు పెద్దగా వాయిస్ లేకుండా పోయింది.టిడిపి తో సఖ్యత గా ఉన్న సమయంలో జనసేనకు కాస్తోకూస్తో ప్రజల మద్దతు లభించినా, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తో ఆ ఫోకస్ లభించడం లేదు.99 అని న్యూస్ ఛానల్ జనసేన కోసం పని చేసినా, అది అంతగా జనాల్లోకి వెళ్లకపోవడం తో చాలాకాలం నుంచి మీడియా ఫోకస్ కోసం జనసేన ఎదురుచూస్తోంది.ఈ నేపథ్యంలో పవన్ భక్తుడిగా పేరు పొందిన సినీ నిర్మాత బండ్ల గణేష్ ఆధ్వర్యంలో కొత్త న్యూస్ ఛానల్ రాబోతున్నట్లు తెలుస్తోంది.
దీనికి తగ్గట్లుగానే కొన్ని పరిణామాలు చోటు చేసుకోవడంతో , ఆ వార్తల్లో నిజం ఉందనే ప్రచారానికి బలం చేకూరింది.పవన్ కళ్యాణ్ ను ఆదరించాలి అంటే న్యూస్ ఛానల్ అవసరం అని, మీరు ఓ న్యూస్ ఛానల్ పెట్టండి దానికి జనసైనికులు అండగా ఉంటామంటూ సోషల్ మీడియాలో ఓ అభిమాని పెట్టిన పోస్ట్ కు బండ్ల గణేష్ స్పందించారు.
కొత్త ఛానల్ ఏర్పాటుకు ఆయన అంగీకారం తెలుపుతున్నట్లు సదరు ట్వీట్ కు రీ ట్వీట్ ఆయన కొట్టడంతో త్వరలోనే కొత్త ఛానల్ ఏర్పాటు ప్రక్రియ మొదలు కాబోతోందనే హడావుడి మొదలైంది.
2024 నాటికి అధికారం దక్కించుకునే స్థాయిలో జనసేన జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్న పవన్ కు బండ్ల గణేష్ ఆధ్వర్యంలో కనుక న్యూస్ ఛానల్ పెడితే , అది జనాలు ఆదరణ పొందితే పవన్ రాజకీయ దూకుడుకి మరింత బలం చేకూరినట్లు అవుతుంది.