టాలీవుడ్ సినీ ప్రముఖుల్లో పలువురు కరోనా బారిన పడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారిలో మొదటగా కరోనా నిర్థారణ అయ్యింది బండ్ల గణేష్కు అనే విషయం తెల్సిందే.
బండ్ల గణేష్కు కరోనా నిర్థారణ అయిన వెంటనే టాలీవుడ్లో ఆందోళన వ్యక్తం అయ్యింది.అసలేం జరగబోతుంది అనే ఆందోళన అందరిని భయానికి గురి చేసింది.
ఇలాంటి సమయంలో బండ్ల గణేష్ పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నట్లుగా ప్రకటించి గుడ్ న్యూస్ చెప్పాడు.
ఈమద్య కాలంలో పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలకు కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందని కాని చాలా మంది ఆ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు అంటూ వాదన వినిపిస్తుంది.
ఎందుకంటే వైరస్ వచ్చినా పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు.రెండు వారాలు సైలెంట్గా ఉంటే మూడవ వారంకు ఎలాంటి ఆందోళన లేకుండా నలుగురితో కలవచ్చు అనేది కొందరి వాదన.
అందుకే బయటకు కేసుల సంఖ్య తెలియడం లేదు.
బండ్ల గణేష్ తాజాగా ప్రముఖ హాస్పిటల్లో మరో సారి పరీక్షలు చేయించుకోగా నెగటివ్ వచ్చినట్లుగా నిర్థారణ అయ్యింది.
బండ్ల గణేష్ ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాడు.దేవుడికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశాడు.
కరోనా నుండి బయట పడ్డందుకు చాలా సంతోషంగా ఉందన్న బండ్ల గణేష్ తన ఫ్యామిలీకి ఈ వైరస్ సోకనందుకు కూడా ఆనందం వ్యక్తం చేశాడు.మొత్తానికి జీవితంలో ఒక కీలకమైన రోజులను ఆందోళనకరమైన రోజులను గడిపినట్లుగా బండ్ల గణేష్ సన్నిహితులతో అంటున్నాడట.