కరోనా వైరస్ కారణంగా మనుష్యులు చాలా నేర్చుకున్నారు.తోటివారికి సాయం చేసేందుకు అందరూ ముందుకు వస్తున్నారు.
కాగా లాక్డౌన్లో వలస కార్మికులను తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన సొంత ఖర్చులతో సాయం చేశాడు.దీంతో ఆయన దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ను తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే.
కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ రైతు కుటుంబానికి ట్రాక్టర్ను కొనిచ్చి తన ధాతృత్వాన్ని చాటుకున్న సోనూ సూద్ బాటలో ఓ తెలుగు కమెడియన్ కమ్ ప్రొడ్యూస్ నడుస్తున్నాడు.
కాగా తాజాగా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి తనవంతు సాయాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఓ వ్యక్తి తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని, తన కుటుంబాన్ని ఆదుకునేందుకు తన కిడ్నీని అమ్ముకుంటానని చెప్పడంతో ఆ వ్యక్తికి తాను ఉద్యోగం ఇస్తానంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.అలాగే ఓ రిపోర్టర్కు కరోనా పాజిటివ్ రావడంతో అతడికి ఆర్ధిక సాయం అందచేశాడు.
మొత్తానికి కరోనా కష్టకాలంలో తనను సాయం చేయాలని కోరిన వారికి తనవంతుగా ఏదో ఒక విధంగా సాయం చేస్తూ మానవత్వం చాటుతున్నాడు బండ్ల గణేష్.ఇక కమెడయిన్తో పాటు నిర్మాతగా తెలుగు ప్రేక్షకులను అందించడంలో ముందుకు వస్తున్న బండ్ల గణేష్ మానవత్వానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఇక ఈ నిర్మాత చేస్తున్న మంచి పనులను పలువురు కొనియాడుతున్నారు.