నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత అనూహ్య పరిణామాల మద్య నిర్మాతగా మారాడు.పవన్ ప్రోత్సాహంతో బండ్ల గణేష్ స్టార్ నిర్మాతగా పేరు దక్కించుకున్నాడు.
ఇలాంటి సమయంలోనే వరుసగా ఫ్లాప్స్ చవిచూసి ఆర్థికంగా చితికి పోయిన బండ్ల గణేష్ సినిమాల నిర్మాణం ఆపేశాడు.ఇటీవల కరోనా పాజిటివ్ అంటూ తేలడం, ఆ తర్వాత కొన్ని రోజులకు నెగిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
కరోనాను జయించిన తర్వాత బండ్ల గణేష్ తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశాడు.సరిలేరు నీకెవ్వరు చిత్రంతో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన తనకు సంతృప్తి మిగలలేదన్నాడు.
మహేష్బాబు అభిమాన హీరో అవ్వడం వల్ల ఆ సినిమాను చేశాను తప్ప అంతకు మించి లేదని చెప్పుకొచ్చాడు.
ఇకపై సీరియస్ సినిమాలు మాత్రమే చేస్తాను, సీరియస్గా ఉండే పాత్రలను మాత్రమే చేస్తానంటూ పేర్కొన్నాడు.
ఇదే సమయంలో తన భవిష్యత్తు ప్రణాళికలను గురించి మాట్లాడుతూ తన కొడుకును హీరోగా పరిచయం చేస్తానంటూ ప్రకటించాడు.ఖచ్చితంగా నా కొడుకును ఇండస్ట్రీలో పరిచయం చేసిన తర్వాత మాత్రమే నేను సినిమాల నుండి తప్పుకుంటాను అంటూ ప్రకటించాడు.