తెలుగు సినీ నటుడు బండ్ల గణేష్ గురించి అందరికీ పరిచయమే.నటుడిగానే కాకుండా నిర్మాత కూడా బాధ్యతలు చేపట్టాడు.
ఇక పలు సినిమాలలో సహాయ పాత్రలలో మెప్పించాడు.గబ్బర్ సింగ్, తీన్మార్ వంటి పలు సినిమాలలో నిర్మాతగా చేశాడు.
ఇక ఈయన వ్యక్తిగత విషయంలో మరింత పరిచయాన్ని పెంచుకున్నాడు.సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక తాజాగా మళ్లీ వస్తున్న అంటూ ఓ ట్వీట్ చేశాడు.
ఇక బండ్ల గణేష్ నటుడిగా, నిర్మాతగానే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా మరింత పరిచయాన్ని పెంచుకున్నాడు.
నిత్యం పవన్ గురించి మాట్లాడుతూ.పవన్ గురించి పొగుడుతూ ఉంటాడు.
ఏ కార్యక్రమంలో పాల్గొన్న కూడా పవన్ గురించి మాట్లాడనిదే ఉండడనే చెప్పాలి.అంతేకాకుండా ఆయనకు దేవర అని పేరు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇదంతా పక్కన పెడితే ఇటీవలే ఆయన తన ట్విట్టర్ ఖాతాను త్వరలోనే తొలగిస్తానని తన అభిమానులతో తెలిపాడు.ఇకపై ట్విట్టర్ కి గుడ్ బై చెప్పేస్తా నో కాంట్రవర్సీ నా లైఫ్ లో అలాంటి వాటికి చోటులేదు అంటూ తన ఖాతాను తొలగించడానికి సిద్ధమయ్యాడు బండ్ల గణేష్.
కానీ తాజాగా మళ్లీ మరో ట్వీట్ చేశాడు.ఈ నిర్ణయాన్ని తాను మార్చుకుంటున్నానని ఓ జర్నలిస్ట్ తనకు ఓ విషయం చెప్పడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నానని తెలిపాడు బండ్ల గణేష్.పెద్దలు జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబు ఈ రోజుల్లో ప్రజలకి సోషల్ మీడియా అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని అందుకు ప్రజలకి సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉండమని తనకు సలహా ఇచ్చాడట.ఇక ఆయన ఇచ్చిన గౌరవాన్ని కాదనకుండా మళ్లీ మీ అందరి ముందుకు వచ్చానని తెలిపాడు బండ్లగణేష్.
మొత్తానికి బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతాను తొలగించటం లేదని అందరికీ తెలిసిన వెంటనే.పవన్ అభిమానులు ఆయనకు తెగ కామెంట్లు చేస్తున్నారు.