కరోనా మహమ్మారి ప్రస్తుతం దేశంలో తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తుంది.తారతమ్యా బేధాలు లేకుండా కరోనా వైరస్ అందరిని తన బారిన పడేలా చేసుకుంటుంది.
ఇక టాలీవుడ్ లో మొదటి సారిగా నిర్మాత బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు.ఈ విషయం బయటకి రాగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ఇక ఇతనితో కాంటాక్ట్ అయిన వారందరూ హోం క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు.ఇక గత రెండు వారాల నుంచి బండ్ల గణేష్ కరోనాకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో తాజాగా మరోసారి ఆయన కరోనా పరీక్షలు చేయించుకాగా కరోనా నెగిటివ్ వచ్చింది.
ఇక కరోనా నుంచి బయటపడిన ఫ్లాస్మాతో ఇతర కరోనా రోగులకి ట్రీట్మెంట్ చేస్తున్నారు.
ఇది చాలా చోట్ల జరుగుతుంది.ఈ నేపధ్యంలో చాలా మంది కరోనా బారిన పడి బయటపడ్డ వారు ఫ్లాస్మా దానం చేయడానికి ముందుకోస్తున్నారు.
ఇక బండ్ల గణేష్ కూడా కరోనా నుంచి బయటపడటంతో ఫ్లాస్మా దానం చేయడానికి ముందుకొచ్చారు.తనకి పూర్తిగా రికవరీ అయిన వెంటనే ఫ్లాస్మా దానం చేస్తానని బండ్ల గణేష్ తాజాగా తెలియజేశాడు.