నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన బండ్ల గణేష్ నిర్మాతగా మారి పలు పెద్ద సినిమాలను నిర్మించాడు.పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి దిగ్గజాలతో సినిమాలను నిర్మించిన బండ్ల గణేష్ గోవిందుడు అందరి వాడేలే సినిమా తర్వాత నిర్మాతగా సినిమాలు చేయకుండా ఉండి పోయాడు.
బండ్ల గణేష్ మళ్లీ సినిమాలను నిర్మించాలని చాలా మంది కోరుకుంటున్నారు.సినిమాలకు దూరంగా ఉన్నా కూడా బండ్ల గణేష్ ఎప్పుడూ కూడా మీడియాలో కనిపిస్తూ వస్తున్నాడు.
దాంతో ఈయనకు నటుడిగా కూడా ఆఫర్లు వస్తున్నాయి.సరిలేరు నీకెవ్వరు సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు.
ఇటీవల క్రేజీ అంకుల్స్ సినిమాలో కూడా కనిపించి మెప్పించాడు.
మొత్తానికి బండ్ల గణేష్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నాడు అనుకుంటూ ఉన్న సమయంలో అతి త్వరలో ఒక బిగ్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లుగా బండ్ల గణేష్ సన్నిహితుల వద్ద అన్నాడట.ఆ బిగ్ గుడ్ న్యూస్ ఏమై ఉంటుందా అంటూ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా ను నిర్మించడమే బండ్ల గణేష్ కు బిగ్ గుడ్ న్యూస్ అవుతుందని.
అందుకే ఆయన త్వరలో ప్రకటిస్తాను అన్నాడు.త్వరలో అంటే పవన్ బర్త్ డే కు తన నిర్మాణంలో సినిమా గురించి అధికారికంగా ప్రకటన చేస్తాడేమో అంటూ కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే మరి కొందరు మాత్రం ఈయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
అందుకు సంబంధించిన ప్రకటన ఏమైనా చెప్పబోతున్నాడా అంటూ కూడా కొందరు ఎదురు చూస్తున్నారు.మొత్తానికి బండ్ల గణేష్ నుండి ఏదో బిగ్ ప్రకటన అయితే రాబోతుంది అంటూ క్లారిటీ వచ్చింది.
పవన్ బర్త్ డే రోజున ఆ ప్రకటన ఉంటుందా అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.