తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా మిషన్-12 పేరిట ఇలా రకరకాల వ్యూహాలను పన్నుతూ బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తున్నారు.కులాల నియోజకవర్గాల వారీగా స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతూ గత ఎన్నికల కంటే మెరుగైన స్థానాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం బీజేపీ క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నిర్మాణంపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన నేపథ్యంలో రానున్న రోజుల్లో క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వాలన్నది బీజేపీ వ్యూహం అని తెలుస్తోంది.ప్రస్తుతం టీఆర్ఎస్ టార్గెట్ గా బీజేపీ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి రెండవ స్థానంలో నిలుస్తుందా, లేక ఏకంగా టీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి అధికారంలోకి వస్తుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
అయితే రానున్న రోజుల్లో బీజేపీ పైనే కెసీఆర్ టార్గెట్ పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది.అంతేకాక బీజేపీ జాతీయ నేతలు కూడా వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టనున్న తరుణంలో ఎన్నికల వాతావరణం తీవ్ర స్థాయిలో రణరంగంగా మారే అవకాశం ఉంది.
అందుకే ఎన్నికల సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఇప్పటికే పూర్తి స్పష్టతగా ఉన్న పరిస్థితుల్లో అందుకు తగ్గట్టుగా సిద్దంగా ఉండేలా ఇప్పటి నుండే బండి సంజయ్ చాలా స్పష్టతతో ఉన్న పరిస్థితుల్లో బండి సంజయ్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయనేది చూడాల్సి ఉంది.అంతేకాక బీజేపీ వైపు ప్రజలు కొద్దిగా ఆసక్తి ప్రదర్శిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తూ టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెంచి బీజేపీకి మరింతగా ఓటుబ్యాంకు పెంచుకోవాలనేది బీజేపీ ప్రధాన వ్యూహంగా అనిపిస్తోంది.