తెలంగాణ బీజేపీ కొత్త ఛీఫ్‌ రేసులో యువ ఎంపీ

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా బలం పుంజుకుంది.గతంతో పోల్చితే బీజేపీ రాష్ట్రంలో చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది.

 Bandi Sanjay Telangana Bjp New Chief Amithshaw-TeluguStop.com

గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి.కాని నాలుగు నెలల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలను దక్కించుకుని సత్తా చాటింది.

హైదరాబాద్‌లో కూడా బీజేపీ బలం అనూహ్యంగా పెరిగిందని టాక్‌ వినిపిస్తుంది.ఇలాంటి పరిస్థితుల్లో కాస్త శ్రద్దగా పార్టీని పెంచుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక స్థానం పోషించే అవకాశం ఉంటుందని అధినాయకత్వం భావిస్తుంది.

తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కొత్త ఛీఫ్‌ను నియమించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా భావిస్తున్నాడు.ప్రస్తుతం లక్ష్మణ్‌ అధ్యక్షుడిగా ఉన్నాడు.మరోసారి తనకే అవకాశం కావాలని ఆయన కోరుకుంటున్నాడు.కాని అమిత్‌ షా మాత్రం కొత్త వారికి ఛాన్స్‌ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.

ఇటీవల కరీంనగర్‌ నుండి ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తున్నారట.ఆయనకు యూత్‌లో మంచి ఫాలోయంగ్‌ ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులను కార్యకర్తలను ఆయన కలుపుకు పోవడంతో పాటు పార్టీని పెంచగల సామర్ధ్యం ఉందని భావిస్తున్నారు.ఈయనకు ఆర్‌ఎస్‌ఎస్‌ నుండి మద్దతు ఉంది.

మరి కొన్ని రోజుల్లోనే కొత్త ఛీప్‌ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube