తెలంగాణ బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు బిజేపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ సిఎం కేసిఆర్ పై ఆరోపణలు చేశాడు.ఈ నేపథ్యంలోనే నిన్న కేసిఆర్ తో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం అయ్యారు.
ఆ సమావేశంలో ఏమి చర్చించారో చెప్పాలని డిమాండ్ చేశాడు.ఎందుకు ఉద్యోగ సంఘాలు కేసిఆర్ ని చూసి భయపడుతున్నాయో అర్థం కావడంలేదు అన్నాడు.
ఇన్ని రోజులు వేతరణ సవరణ సంఘం నేతలు ఏమి చేశారని ప్రశ్నించాడు.సమాజంకోసం విలేకరులు కష్టపడి పనిచేస్తున్నారని అలాంటి వారికి ఇల్లు కట్టిస్తామని చెప్పి కేసిఆర్ మాట తప్పాడు అన్నాడు.
విలేకరులు ధైర్యం చేసి అడుగుదాము అంటే అడిగే పరిస్థితి లేదు.జర్నలిస్టుల సమస్యను కేసిఆర్ పట్టించుకోవడం లేదు అన్నాడు.
విలేకరుల సమావేశం పెట్టి అడిగిన ప్రశ్నలకు సమాదానం చెప్పలేక కేసిఆర్ ఎన్నో సార్లు పాత్రికేయ మిత్రులపై కసురు కున్నాడు.కోవిడ్ సమయంలో కెమెరా మేన్స్ గాని విలేకరులు గాని ఎంతో సహసోపేతమైన సేవలను అందించారని బండి అన్నాడు అది మర్చిపోయినవాళ్లు మూర్ఖులే అన్నాడు. విలేకరులకు అండగా బిజేపి పార్టీ ఉంటుందని మాట ఇచ్చాడు.