తెలంగాణాలో రాజకీయ వేడి ఇప్పట్లో చల్లారేలా లేనట్లుగా కనిపిస్తుంది.ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల త్రిముఖ మాటల యుద్ధం రోజు రోజుకు ముదిరిపోతుంది.
ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శల అస్త్రాలను సంధించుకుంటూ నువ్వెంత అంటే నువ్వెంత అనే స్దాయిలో ఉన్నారు.ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ ని సీఎం చేయడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌస్ లో మూడు రోజుల పాటు దోష నివారణ పూజలు నిర్వహించి, పూజ సామగ్రిని త్రివేణి సంగమంలో కలిపేందుకే కుటుంబ సమేతంగా కాళేశ్వరానికి వెళ్లారని విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మూడో టీఎంసీ అంటూ ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్ దానివల్ల వచ్చే లాభమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ సీఎం కావాలని తెలంగాణ ఉద్యమ ద్రోహులు మాత్రమే కోరుకుంటున్నారని, నిజమైన ఉద్యమకారులకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు.దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న సీయం కొడుక్కి ఆ పదవి కట్టబెట్టడం ఆయనకే చెల్లుతుందని ఎద్దేవ చేశారు.
ప్రజల కోసం ఆలోచించని సీయం బహూశా ప్రపంచంలో మీరొక్కరే కావచ్చూ అంటూ దుయ్యబట్టారు బండి సంజయ్.