తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి జిల్లా నాయకులతో కార్యకర్తలతో భేటీ అవుతూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికలకు.పాదయాత్ర ఫార్ములాతో ప్రత్యర్థులను చిత్తు చేయాలని డిసైడ్ అయ్యారు.ఈ క్రమంలో పాదయాత్ర 4 విడుతలగా.చేయాలని ముందుగా హుజురాబాద్ ఉప ఎన్నికలకు రెడీ అవుతూ భాగ్యలక్ష్మి ఆలయం నుండి స్టార్ట్ చేయాలని బండి సంజయ్ డిసైడ్ అయ్యారు.
ఆగస్టు 9వ తారీఖున ఈ మొదటి విడత పాదయాత్ర స్టార్ట్ చేసి.హుజరాబాద్ ఉప ఎన్నికలలో గెలిచేలా ప్రజల్లోకి బలంగా వెళ్లి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం అని బండి సంజయ్ డిసైడ్ అయ్యారట.
ఇదిలా ఉంటే పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేకపోతే మరో కేంద్ర మంత్రిని తీసుకునే ఆలోచనలో తెలంగాణ బిజెపి రాష్ట్ర నాయకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.