తెలంగాణలో ఇక వరుసగా పాదయాత్ర ల సీజన్ జగన్ మొదలు కాబోతున్నట్టు కనిపిస్తోంది.ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిగా నియమించబడిన రేవంత్ రెడ్డి తెలంగాణ అంతటా పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు.
ఈ మేరకు అధిష్టానం పెద్దల అనుమతి తీసుకున్నారు.ఇక అసంతృప్తులు, సీనియర్ నాయకులు నుంచి పెద్దగా అభ్యంతరాలు లేకపోవడంతో రేవంత్ పాదయాత్ర త్వరలోనే మొదలు కాబోతోంది.
అలాగే కొత్తగా పార్టీ పేరును ప్రకటించబోతున్న వైఎస్ షర్మిల తన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి తాను జగన్ మాదిరిగా అధికారంలోకి రావాలని చూస్తున్నారు.ప్రజలకు దగ్గరయ్యేందుకు పాదయాత్ర ఒక్కటే మార్గం గా ఆమె భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఎప్పటి నుంచో పాదయాత్ర చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు.ఈ మేరకు ఆయన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు.
అయితే ఎప్పటికప్పుడు వివిధ రాజకీయ కారణాలతో ఆ యాత్ర వాయిదా పడుతూ వస్తోంది.తాజాగా ఆగస్టు 9వ తేదీ నుంచి తాను పాదయాత్ర చేయబోతున్నట్లు బండి సంజయ్ అధికారికంగా ప్రకటించారు.
హైదరాబాద్ నగరంలోని భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి పాదయాత్ర ప్రారంభించి, హుజురాబాద్ లో ముగించడబోతున్నట్టు ఆయన తెలిపారు.
ప్రజాస్వామ్య తెలంగాణ కోసం తాను పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ యాత్ర చేపడుతున్నట్లు కనిపిస్తున్నా, ఎన్నికలు ముగిసిన అనంతరం తెలంగాణలోని అన్ని నియోజక వర్గాలు కవర్ అయ్యే విధంగా ఆయన పాదయాత్రకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.తెలంగాణలో టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చి ఆ పార్టీని అధికారానికి దూరం చేయబోయేది తామేనని , రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా మాత్రమే ఎగురుతుంది అనే దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం ఏమీ లేదు అన్నట్లుగానే ఆయన వ్యవహరిస్తున్నారు అందుకే కాంగ్రెస్ పదేపదే బిజెపిపై విమర్శలు చేసిన ఎక్కడ బీజేపీ నుంచి స్పందన కనిపించడం లేదు.