కరీంనగర్ పార్టీ కార్యాలయంలో పాదయాత్ర కమిటీతో బీజేపీ చీఫ్ బండి సంజయ్ భేటీ అయ్యారు.తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో పాదయాత్రను ఎప్పుడు ప్రారంభించాలనే దానిపై కమిటీతో చర్చిస్తున్నారు.
సభ నిర్వహించిన తర్వాతే పాదయాత్ర చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.చలి తీవ్రత ఎక్కువగా ఉంటున్న తరుణంలో సాయంత్రం వద్దని కమిటీ సభ్యులు సూచిస్తున్నారు.
ఈ క్రమంలో బండి సంజయ్ పాదయాత్ర రేపటి నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.కాగా నిర్మల్ జిల్లాలోని భైంసా నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారని సమాచారం.