తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలపడుతోంది.తెలంగాణ వ్యాప్తంగా బలపడేందుకు పెద్ద ఎత్తున కార్యాచరణను రూపొందిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే వరుస ఉప ఎన్నికల్లో గెలుపొందుతున్న బీజేపీ ఇక రాష్ట్ర వ్యాప్తంగా బలపడేందుకు క్షేత్ర స్థాయి కార్యవర్గాన్ని నిర్మించుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇక సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలే గడువు ఉండటంతో ఇక ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.
అయితే మొదటి నుండి టీఆర్ఎస్ పై వ్యతిరేకతను పెంచడంలో పెద్ద ఎత్తున కీలక పాత్రను పోషించిన బీజేపీ ఇక అన్ని రకాల కులాలకు, అన్ని రకాల వర్గాలకు దగ్గర కావడానికి బీజేపీ చీఫ్ బండి సంజయ్ త్వరలో జిల్లాల పర్యటనలు చేయనున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు చేయడం సులభమే కానీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయడం అంతగా సులభం కాదు.
అందుకే ఆ వాస్తవాన్ని గ్రహించి క్షేత్ర స్థాయి బలమైన కార్యవర్గాన్ని నిర్మించుకుంటూ స్థానిక నాయకత్వానికి అన్ని వర్గాల మద్దతు అందేలా బండి సంజయ్ స్వయంగా భేటీ అవనున్నట్లు తెలుస్తుంది.
ఇక ఇప్పటి వరకైతే ప్రభుత్వం మాత్రం పాలన పైనే పెద్ద ఎత్తున దృష్టి పెడుతున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది.దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నిరాశకు గురవుతున్నారు.మరి బండి సంజయ్ జిల్లాల పర్యటనలతో ఏ మేరకు బీజేపీ బలపడుతుందో భవిష్యత్తులో మాత్రమే తెలిసే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి ఐతే ఇంకా పర్యటన పట్ల బీజేపీ నుండి ఇంకా క్లారిటీ రాలేదు.ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలవుతున్న పరిస్థితిలో కోడ్ ముగిశాక జిల్లాల పర్యటనను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు బీజేపీ వర్గాలలో చర్చ జరుగుతోంది.