తెలంగాణాలో జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగారని తెలిసిందే.కరోనా ఉదృతంగా ఉన్న ఇలాంటి టైం లో జూడాలు సమ్మెకు దిగడం షాక్ ఇచ్చింది.
జూనియర్ డాక్టర్లకు మద్ధతుగా కే.సి.ఆర్ పై రాష్ట్రం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.సరైన టైం లో స్పందిస్తే జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు సమ్మకు దిగేవారు కాదని సంజయ్ అన్నారు.
జూనియర్ డాక్టర్లను పిలిచి చర్చించే ధైర్యం కూడా కే.సి.ఆర్ కు లేదా అని మండి పడ్డారు.జూడాల సమ్మెకు నైతిక బాధ్యత వహిస్తూ కే.సి.ఆర్ క్షమాపణ చెప్పాలని అన్నారు.కరోనా ఉదృతంగా ఉన్న ఇలాంటి టైం లో జూనియర్ డాక్టర్ల మీద ఒత్తిడి పడుతుందని అన్నారు.ఇక ఖాళీలను కే.సి.ఆర్ ఎందుకు భర్తీ చేయడం లేదని ఆయన అన్నారు.
కరోనా కారణంగా మృతి చెందిన వైద్య సిబ్బందిలో ఎంతమందికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందో చెప్పాలని సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అత్యవసర సేవలకు భంగం కలిగించకుండా వెంటనే జూనియర్ డాక్టర్లు పనుల్లో జాయిన్ అవ్వాలని వారి తరపున బీజేపీ పోరాడుతుందని ఆయన అన్నారు.
హాస్పిటల్స్ లో కే.సి.ఆర్ సందర్శించి సమస్యలను గుర్తించారో లేదో అన్నది మాత్రం చెప్పలేదని అన్నార్., సిఎం వస్తున్నారంటూ హాస్పిటల్స్ లో సినిమా సెట్టింగులు తరహా ఏర్పాటు చేస్తున్నారని.
అక్కడకెళ్లి కే.సి.ఆర్ నటిస్తున్నాడని మండిపడ్డారు.అంతేకాదు రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయంటూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆయన అన్నారు.