తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.కృష్ణా నదీ జలాల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డ్రామాలాడుతున్నారని సీరియస్ కామెంట్లు చేశారు.
ముఖ్యంగా ప్రాజెక్టుల వద్ద పోలీసులు మోహరింపు చేసి ఉద్రిక్తలు పెంచేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వం సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి కేంద్రం 1200 కోట్ల రూపాయలు మంజూరు చేసిన నేపథ్యంలో.
నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించిన బండి సంజయ్ సోమశిల వద్ద కృష్ణా నదికి పూజలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
గతంలో ఆయన ఇచ్చిన హామీలు రైతుల రుణమాఫీ లేదా నిరుద్యోగ భృతి ఇంటికో ఉద్యోగం… ఏది కూడా అమలు కాలేదని స్పష్టం చేశారు.ఈ విషయంలో ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ముందే కేసీఆర్ తన మాట నిలబెట్టుకుని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం లో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు కేంద్రం ఇస్తున్నాడు నిధులు వాడుతున్న గాని ప్రధాని మోడీ ఫోటో పెట్టడం లేదని బండి సంజయ్ సీరియస్ అయ్యారు.దేశంలో ఇటువంటి సంస్కారం లేని ముఖ్యమంత్రి ఎక్కడా లేని అది ఒక కేసీఆర్ మాత్రమే అంటూ సీరియస్ కామెంట్లు చేశారు.