ఆయన మాట్లాడే మాటలు అగ్గిని రాజేస్తుంటాయి.ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి బాంబు పేల్చుతారో ఎవరికీ తెలియదు.
అప్పటి వరకు ఎవరికీ తెలియని విషయాలను కూడా చాలా సునాయాసంగా పట్టేయడంలో ఆయన దిట్టగా మారిపోయారు.ఆయనే బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్.
మొదటి నుంచి తన పదునైన మాటలతో దూసుకుపోతున్న ఆయన ఇప్పుడు మరోసారి టీఆర్ ఎస్ మీద బాంబును పేల్చేశారు.అయితే ఈ సారి ఏకంగా సీఎం సీటుమీద చేసిన కామెంట్లు పెను దుమారం రేపుతున్నాయి.
ఇప్పుడు ప్రగతి భవన్ లో సీఎం కుర్చీ కోసం కొట్లాట మొదలైందని ఆయన నిన్న మాట్లాడారు.ప్రస్తుతం తెలంగాణ సీఎం కుర్చీ కోసం నాలుగు స్తంభాలాట సాగుతోందన్నారు.
సీఎం కేసీఆర్ ను కేటీఆర్, కవిత, హరీశ్ రావు తమనంటే తమనే ముఖ్యమంత్రిని చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారని బండి సంచలన కామెంట్లు చేశారు.ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టీఆర్ ఎస్లో అగ్గిని రాజేస్తున్నాయి.
ఇప్పటికే టీఆర్ ఎస్ రెబల్స్ చాలా ఎక్కువయిపోతున్నారు.ఇలాంటి వారికి బండి సంజయ్ కామెంట్లు మంచి ఆయుధంలా మారిపోతున్నాయి.
ఒకవైపు లోకల్ బాడీ ఎమ్మెల్సీ కోసం నానా ప్రయాసలు పడుతోంది టీఆర్ ఎస్.సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తుండటంతో నేతలను కాపాడుకోవడానికి, కింది స్థాయి ప్రజా ప్రతినిధులను మెప్పించేందుకు పెద్ద పోరాటమే చేస్తోంది.ఇలాంటి సమయంలో బండి సంజయ్ కామెంట్లు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఇప్పటికే కేసీఆర్ మీద అటు రైతుల నుంచి కూడా బాగానే విమర్శలు వస్తున్నాయి.ఇలా అన్నీ వైపుల మూకుమ్మడి దాడి జరగడం కేసీఆర్ ను ఇబ్బందుల్లో పడేస్తోంది.ఆయనకు రీ కౌంటర్ వేయకపోతే కష్టమనే చెప్పాలి.
మరి టీఆర్ ఎస్ నేతలు బండికి ఎలాంటి కౌంటర్ వేస్తారో చూడాలి.