తెలంగాణ బిజేపి అద్యక్షుడుబండి సంజయ్ మరి కాసేపట్లో జనగామకు బయలుదేరి వెళ్లనున్నాడు.అక్కడి బిజేపి నాయకులు కార్యకర్తలతో కలిసి జనగాం మున్సిపల్ కార్యలయం ఎదుట ధర్నా చేస్తుండగా పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన వారిని కలిసి పరామర్శించనున్నాడు.
పోలీసులు లాఠీచార్జీ చేస్తుండగా తీసిన వీడియోలుసోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ సందర్భంగా బండి సంజయ్ సిఐ మల్లేష్ ను వెంటనే సస్పెండ్ చెయ్యాలను రాష్ట్ర ప్రభుత్వంను డిమాండ్ చేశాడు.
లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగ ధర్నాలు చేస్తాం అని హెచ్చరించాడు..
ఈ నేపథ్యంలోనే ఛలో జనగామ కు పిలుపునిచ్చాడు.మరి కొద్ది సేపట్లో బండి సంజయ్ హైదరాబాద్ నుండి నేరుగా జనగామ బయలుదేరి వెళ్లనున్నాడు.
ఆయన రాకతో పోలీసులు భారీ బందోబస్తీ ని ఏర్పాటు చేశారు.జనగామలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
బండి వస్తుండటంతో పోలీసుల లోనూ, రాష్ట్ర ప్రభుత్వంలోను టెన్షన్ మొదలైంది.
.