బండి సంజయ్ అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక బీజేపీ, తరువాత బీజేపీలా మారిందంటే అది బండి సంజయ్ చరిష్మా అని చెప్పవచ్చు.
అయితే బీజేపీ ఇది వరకు ఉన్న అధ్యక్షులు సౌమ్యులు కాబట్టి క్లాస్ గా ఉండే పరిస్థితి.కాని బండి సంజయ్ మాస్ రాజకీయ నాయకుడిగా ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ బీజేపీని తెలంగాణలో ఈ స్థాయిలో నిలబెట్టాడు.
అయితే తాజాగా స్వైరోస్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హిందూ దేవుళ్ళకు వ్యతిరేకంగా చేసిన ప్రతిజ్ఞ పెద్ద దుమారమే రేపిందని చెప్పవచ్చు.అయితే దీనిపై తొలుత ఘాటుగా స్పందించినది బీజేపీ అని చెప్పవచ్చు.
అయితే బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రవీణ్ కుమార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.అయితే ఇప్పుడు ఈ తప్పిదమే బండి సంజయ్ ను దోషిగా నిలబెట్టిందని చెప్పవచ్చు.
అయితే దళితులకు వ్యతిరేకంగా బీజేపీ ఉన్నదనే ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది.అంతేకాక బండి సంజయ్ ఓ కార్యక్రమానికి వెళ్తుండగా స్వేరో నాయకులు బండి సంజయ్ పై దాడికి ప్రయత్నం చేశారు.
దీంతో అక్కడి నుండి తొందరగా తప్పించుకొని వెళ్ళిపోయాడు.అయితే ఈ విషయంలో బీజేపీని వదిలేది లేదని స్వేరో నేతలు తేల్చి చెబుతుండడంతో అయితే ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందనేది చూడాల్సి ఉంది.