తెలంగాణ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ మొన్నటివరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన సంగతి తెలిసిందే.ఇదిలాఉంటే ఇటీవల తాజాగా హర్యానా రాష్ట్రానికి గవర్నర్ గాకొత్త బాధ్యతలు చేపట్టారు బండారు దత్తాత్రేయ.
ఈ సందర్భంగా హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝ ఆధ్వర్యంలో.బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ భార్య వసంత, కుమార్తె విజయలక్ష్మి ఇంకా ఇతర కుటుంబ సభ్యులతో పాటు పంజాబ్ గవర్నర్ వి.పి.సింగ్ బడ్నోర్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా అదే రీతిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ కీలక నాయకులు జితేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వివేక్, ఎమ్మెల్యే రాజాసింగ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుఈటల రాజేందర్ తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.నిన్నమొన్నటివరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న దత్తాత్రేయ ను ఇటీవల కేంద్రం హర్యానాకు బదిలీ చేయడం జరిగింది.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చండీఘడ్ రాజ్ భవన్ లో జరిగింది.