కార్యాలయాల్లో ఇకపై మొబైల్ ఫోన్లను వాడొద్దని ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
డిస్కంలో ఉద్యోగులు పని వేళల్లో సమయాన్ని వృధా చేస్తున్నారని, పనిని వాయిదా వేస్తున్నారని ఏపీ సీపీడీసీఎల్ సిఎండి పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో పనిగంటలు వృధా కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
అక్టోబర్ నుంచి ఉద్యోగులు ఆఫీస్ కి వచ్చిన వెంటనే తమ ఫోన్లను డిపాజిట్ చేసి రశీదు తీసుకోవాలని సూచించారు.భోజన విరామ సమయంలో మాత్రం ఫోన్లను వాడుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ ఆదేశాలను ఉల్లంఘించిన ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.