ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కొన్ని కొన్ని సార్లు తాము చేసే పొరపాట్లు వల్ల నిషేధాలు ఎదుర్కొంటారు.నిజానికి నటీనటులే కాకుండా దర్శకనిర్మాతలు కూడా ఏమైనా పొరపాటు చేస్తే వారిపై కూడా ఫిలిం ఛాంబర్ బాగా మండిపడుతుంది.
ఫిలిం ఛాంబర్ పైనే సినిమాలు ఆధారపడతాయి.వాళ్ళు చెప్పినట్లు గానే సినిమాలను విడుదల చేయవలసి ఉంటుంది.
కొన్ని కొన్ని సార్లు వాళ్లు చెప్పిన మాట సినీ బృందం వినకపోయేసరికి వారిపై ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.అలా ఇప్పటికే ఎంతో మంది దర్శక నిర్మాతలు ఫిలిం ఛాంబర్ నుండి తీవ్రమైన విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.
ఇక నిర్మాత దిల్ రాజు పై ఏకంగా నిషేధాన్ని విధించారు ఫిలిం ఛాంబర్.ఇంతకూ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు గురించి అందరికీ పరిచయమే.మంచి మంచి సినిమాలను భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు.
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించాడు.ఇక ఆ సంస్థలోనే ఎన్నో సినిమాలకు నిర్మాతగా బాధ్యతలు చేపట్టి మంచి లాభాలు అందుకున్నాడు.
అంతే కాకుండా కొన్ని సినిమాలను కూడా పంపిణీ చేశాడు.బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తగ్గని దిల్ రాజు కు ఎంతో మంది స్టార్ హీరోలు ఈయన నిర్మాణంలోనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.ఇదిలా ఉంటే గతంలో ఈయనపై ఫిలిం ఛాంబర్ ఆగ్రహం చేసిందని తెలిసింది.గతంలో ఈయన నిర్మాణంలో జోష్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా సమయంలో దిల్ రాజ్ కు నిషేదం జరిగింది.ఇంతకు అసలేం జరిగిందంటే.
తాను జోష్ సినిమాలో ఓ నిర్ణయం తీసుకున్నాడు.ఈ సినిమా పబ్లిసిటీ ప్రకారం టీవీ చానల్స్ లో వేసే ప్రోమోల రేట్ల విషయంలో ఫిలిం ఛాంబర్ తమ ఖాతాలో మాటీవీ, జెమిని, ఈటీవీ వంటి కొన్ని చానల్స్ కు సహకరించవద్దని నిర్ణయం తీసుకున్నారు.
దీంతో నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ విషయాలను పట్టించుకోకుండా జోష్ సినిమా ఆడియో ఫంక్షన్ లైవ్ ని ఏకంగా మా టీవీ కి ఇచ్చాడు.అంతేకాకుండా ఈ సినిమా ప్రోమో లను కూడా ఆ ఛానెల్ వాళ్లకే ఇచ్చాడు.దీంతో ఫిలిం ఛాంబర్ వాళ్లకు దిల్ రాజు పై విపరీతమైన కోపం వచ్చింది.ఇక ఆయన పై సీరియస్ యాక్షన్ తీసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీకి నిషేధం చేయాలన్నట్టు తెలిసింది.
మరోవైపు స్టార్ నిర్మాత అల్లు అరవింద్ కూడా రామ్ చరణ్ నటించిన మగధీర మా టీవీ కె బాధ్యతలు ఇచ్చాడు.దీంతో ఓవైపు అల్లు అరవింద్ పై, మరోవైపు దిల్ రాజు పై ఫిలిం ఛాంబర్ బాగా మండి పడిందని తెలిసింది.అయినా కూడా వీళ్ళు పట్టించుకోకుండా తమ సినిమాల బాధ్యతను తామే తీసుకున్నారు.ఇక ప్రస్తుతం దిల్ రాజ్ వరుస సినిమాలకు నిర్మాతగా చేస్తున్న సంగతి తెలిసిందే.