మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు తమ వారసులను తెలుగు తెరకు పరిచయం చేసారు.అయితే వారసులను పరిచయం చేయడం ఆషామాషీ కాదు.
అందుకోసం స్టార్స్ చాలా మంది దర్శకులతో చర్చలు జరుపుతారు.అలా వారసుడి ఎంట్రీ కోసం స్టార్స్ అంతలా ఆలోచిస్తూ ఉంటారు.
ప్రెజెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ వారసుడు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.
బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ సైతం ఎదురు చూస్తున్నారు.
బాలయ్య తన వారసుడును ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి.దీనిపై ఆసక్తికర చర్చలు కూడా జరుగుతున్నాయి.
ప్రెజెంట్ బాలయ్య క్రేజ్ అమాంతం పెరగడంతో ఈయన కొడుకు ఎంట్రీపై కూడా ఆసక్తిగా ఉన్నారు.బాలయ్య తన వారసుడి ఎంట్రీ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఈ మధ్య బాలయ్య సీరియస్ గానే కొడుకు ఎంట్రీపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
అందుకే ఆయన వెళ్లిన చోట్లకు కొడుకుని కూడా తీసుకు వెళుతున్నాడు.మోక్షజ్ఞను బయట చూపిస్తూ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది.అంతేకాదు షూటింగ్ స్పాట్ లలో కూడా తిప్పుతూ ఆ వాతావరణాన్ని అలవాటు చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక కొడుకు మొదటి సినిమా తన డైరెక్షన్ లోనే ఉంటుంది అని అది కూడా ఆదిత్య 369కి సీక్వెల్ గా ఆదిత్య 999 రాబోతుంది అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు.మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.