టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపటి నుంచి పాదయాత్ర చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి మొదలయ్యే పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు దాదాపు 400 రోజులపాటు పాదయాత్రను లోకేష్ నిర్వహించబోతున్నారు.
దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ప్రభుత్వం నుంచి మొదట్లో అనుమతులు లభించకపోయినా, అన్ని అనుమతులతో ఇప్పుడు పాదయాత్రకు లోకేష్ సిద్ధమవుతున్నారు.
ఈ యాత్రను సక్సెస్ చేసి లోకేష్ ప్రభావాన్ని పెంచేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండగా , లోకేష్ మామ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ సినిమా ఫంక్షన్ లో ఎస్వీ రంగారావు అక్కినేని నాగేశ్వరరావు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ప్రభావం చూపించేలా కనిపిస్తున్నాయి.
ఓ సినిమా ఫంక్షన్ లో బాలయ్య మాట్లాడుతూ ఆ రంగారావు ఈ రంగారావు, అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడారు.
దీంతో బాలయ్య వ్యాఖ్యలపై అటు అక్కినేని వారసులతోపాటు, ఎస్వీ రంగారావు పై చేసిన కామెంట్స్ పై కాపు సామాజిక వర్గం బాలయ్య పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఎన్టీఆర్ ను గొప్ప వ్యక్తిగా చెప్పుకునేందుకు ఇతరులను కించపరిచే విధంగా బాలయ్య మాట్లాడడం సరికాదని ఎస్వీఆర్, ఎన్టీఆర్ అభిమానులు బాలయ్యకు సూచిస్తున్నారు.
గతంలోనూ మెగాస్టార్ చిరంజీవితో పాటు, ఎంతోమంది విషయంలో బాలయ్య ఇదేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు .ఇప్పుడు అక్కినేని నాగేశ్వరావు ఎస్వీ రంగారావు పై చేసిన కామెంట్స్ వివాదం పై నడుస్తోంది.ఇది ఎలా ఉంటే వెంటనే బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని, లేకపోతే 27వ తేదీన కుప్పంలో మొదలయ్యే లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామంటూ ఎస్విఆర్ , ఏఎన్ఆర్ అభిమానులు బాలయ్యకు వార్నింగ్ ఇస్తున్నారు.
అంతేకాదు అనేక పట్టణాలు ఇప్పటికే బాలయ్య వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించారు.దీంతో ఇప్పుడు లోకేష్ పాదయాత్ర పై బాలయ్య వ్యాఖ్యల ప్రభావం కనిపించేలా పరిస్థితి ఉంది.ఈ నేపథ్యంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కలుగజేసుకుని బాలయ్యతో క్షమాపణలు చెప్పించి ఈ వివాదానికి ముగింపు పలుకుతారా అనేది ఆసక్తికరంగా మారింది.