బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ అనే కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే.మొదట్లో ఈ కార్యక్రమం గురించి చెప్పినప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో చాలామంది ఈ కార్యక్రమం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.
ఎవరూ ఊహించని విధంగా బాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఈ కార్యక్రమానికి అత్యధిక రేటింగ్స్ కైవసం చేసుకోవడమే కాకుండా ఎక్కువమంది సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు.
ఇప్పటికే ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, న్యాచురల్ స్టార్ నాని హాజరై బాలకృష్ణతో కలిసి ఎంతో సరదాగా ముచ్చటించారు.
ఇక బాలకృష్ణ చేతికి సర్జరీ కావడం చేత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ఈ కార్యక్రమం కొన్ని వారాల పాటు వాయిదా పడింది.ప్రస్తుతం బాలకృష్ణ పరిస్థితి మెరుగుపడటంతో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.
ఈ క్రమంలోనే మూడవ ఎపిసోడ్ లో భాగంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి బ్రహ్మానందం హాజరయ్యారు.
తాజాగా ఆహా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా బాలకృష్ణ వీరితో ఎంతో సరదాగా ముచ్చటించారు.
ఇక బ్రహ్మానందం తనకు ఇష్టమైన హీరో ఏఎన్నార్ అని చెప్పగానే బాలకృష్ణ ఏఎన్నార్ ను ఇమిటేట్ చేస్తూ చెప్పిన డైలాగులు ఆద్యంతం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.ఈ క్రమంలోనే ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక నాలుగవ ఎపిసోడ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.