నటసింహం నందమూరి బాలకృష్ణ వరస సినిమాలను లైన్లో పెట్టాడు.బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.
ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.అందుకే ఇప్పుడు రాబోతున్న అఖండ సినిమాపై కూడా అంచనాలు పీక్ స్థాయికి చేరుకున్నాయి.
ఈ మధ్యే ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ టీజర్ చూసిన తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ సినిమాలో బాలయ్య ఇంత వరకు చూడని సరికొత్త లుక్ లో కనిపించాడు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.
గోపీచంద్ మలినేని మాస్ రాజా రవితేజ తో తీసిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే బాలయ్య ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.
బాలయ్య కోసం గోపీచంద్ మలినేని ఇప్పటికే ఒక కథను కూడా రెడీ చేసాడని అందుకే బాలకృష్ణను కలిసి ఆ కథను కూడా వినిపించాడని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారని తెలుస్తుంది.ఇప్పటికే గోపీచంద్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారట.
ఈ సినిమాలో బాలకృష్ణ పల్నాటి ప్రాంతానికి చెందిన ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం.ఈ సినిమా జులై నుండి సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీగా ఉందని ఉందట.
వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనీ అనుకుంటున్నట్టు సమాచారం.