లాక్ డౌన్ తర్వాత మరల సినిమా షూటింగ్ లు యధావిధిగా మొదలయ్యాయి.పెద్ద పెద్ద సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్లిపోయాయి.
రజినీకాంత్ లాంటి స్టార్ కూడా షూటింగ్ లో జాయిన్ అయిపోయారు.అయితే బాలకృష్ణ, బోయపాటి మాత్రం ఇప్పటి వరకు షూటింగ్ స్టార్ట్ చేయలేదు.
బోయపాటి దర్శకత్వంలో సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బాలయ్య మూడో సారి చేస్తున్నాడు.ఈ సినిమా ఎప్పుడో లాక్ డౌన్ కి ముందే మొదలైంది.
అయితే
కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్
తో వాయిదా పడిపోయింది.తరువాత లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇచ్చినా హీరోయిన్ ఎంపిక విషయంలో ఆలస్యం అవుతూ వస్తుందని తెలుస్తుంది.
ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరనే విషయం బయటకి రాలేదు.చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.
అంజలి, వేదిక, పూర్ణ, సాయేషా సైగల్, ప్రగ్యా జైశ్వాల్ లాంటి అందాల భామలు అందరి పేర్లు వినిపిస్తున్నాయి.అయితే వీరిలో ఎవరిని ఫైనల్ చేశారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ మరో సారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.అయితే ఈ సారి కెరియర్ లో ఎన్నడూ చేయనటువంటి అఘోరా పాత్రలో బాలయ్యబాబు కనిపించబోతున్నాడు.దీనిపై ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరో వైపు ఈ సినిమా కథ నేపధ్యం అంతా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది.బాలయ్య కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు సినిమాలు రాయలసీమ నేపధ్యంలోనే ఉంటాయి.అలాగే అతనికి భారీ డిజాస్టర్స్ ఇచ్చిన సినిమాలు కూడా రాయలసీమ నేపధ్యంలోనివే.
ఇప్పుడు ఈ సినిమా కోసం బాలకృష్ణని మరల బోయపాటి నంద్యాల తీసుకుపోతున్నాడు.అక్కడ యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేతున్నాడు.
సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.