నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం లో అఖండ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా దాదాపు చివరి దశకు చేరుకుంది.
మొన్నటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో నందమూరి అభిమానులు నిరాశలో ఉన్నారు.కానీ ఉగాది పండుగ కానుకగా ఈ సినిమా టైటిల్ ను, టీజర్ ను విడుదల చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేసారు.
బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి.ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలు హిట్ అయ్యాయి.
ఇప్పుడు అఖండ సినిమాపై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి.ఇంకా విడుదలైన టీజర్ చూసిన తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇంత వరకు బాలయ్యను చూడని సరికొత్త లుక్ లో కనిపించడం ఆ లుక్ కూడా ఆయనకు సెట్ అవ్వడంతో విడుదలైన టీజర్ రికార్డులు సృష్టించింది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.పూర్ణ ఒక కీలక పాత్రలో నటిస్తుంది.ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
అయితే టీజర్ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్ విడుదల చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ను రెడీ చేస్తున్నట్టు తెలిసింది.సరైన సమయం చూసి ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తారట.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. మే 28 విడుదల అవుతుందని ప్రకటించిన ఇప్పుడు కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.