నిన్న మండలి గ్యాలరీలో నందమూరి బాలకృష్ణతో ఎమ్మెల్యే రోజా సెల్ఫీ తీసుకున్న విషయం తెల్సిందే.ఆ సెల్ఫీ రచ్చ రచ్చ అవుతుంది.
వర్మ ఆ సెల్ఫీలో రోజా చాలా అందంగా ఉంది, ఆమె పక్కన ఉన్న వ్యక్తి వల్ల ఆమె అందం తగ్గింది అన్నాడు.అదే సమయంలో ఆమెకు ఆయన దిష్టి బొమ్మ అయ్యి ఉంటాడు అని కూడా వర్మ కామెంట్ చేశాడు.
రోజా, బాలకృష్ణల సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే ఇక్కడ టిస్ట్ ఏంటీ అంటే అసెంబ్లీ మరియు మండలిలో మొబైల్ వినియోగం నిషిద్దం.
గ్యాలరీలో కూర్చున్న వారు కూడా తమ మొబైల్స్ను బయటకు తీయవద్దు.అసలు అసెంబ్లీ లేదా మండలి హాలులోకి మొబైల్స్ అనుమతించరు.కాని రోజా ఎలా మొబైల్ తీసుకు వచ్చింది.ఆ మొబైల్ రోజాదేనా లేదా మరెవ్వరిదైననా అంటూ ఇప్పుడు చర్చ మొదలైంది.
రోజా అధికార పార్టీ కనుక ఆమె మొబైల్ తీసుకు వచ్చి ఉంటుందని కొందరు అంటూ ఉంటే మరికొందరు ఆ మొబైల్ ఎవరిదో గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నాడు.బీజేపీ నాయకుడు ఎమ్మెల్సీ మాధవ్ ఈ విషయమై స్పందిస్తూ రోజా చేతిలో ఉన్న మొబైల్ ఎవరిదో తెలుసుకుని చర్యలు తీసుకోవాలంటూ చైర్మన్కు విజ్ఞప్తి చేస్తున్నాడు.