ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది నిర్వహించే బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ ముగిసింది.గత రికార్డులు బ్రేక్ చేస్తూ.ఈ సారి రూ.24.60 లక్షలు పలికింది గణపతి లడ్డూ.కరోనా వ్యాప్తి కారణంగా 2020లో వేలం పాటను రద్దు చేయగా.గత సంవత్సరం రూ.18.90 లక్షలు పలికిన విషయం తెలిసిందే.
ఈసారి గణపతి లడ్డూ కోసం మొత్తం తొమ్మిది మంది పోటీ పడ్డారు.ముందుగా రూ.19 లక్షలతో వేలం ప్రారంభమైంది.చివరకు రూ.24.60 లక్షలకు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూను సొంతం చేసుకున్నారు.దీంతో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు ఆయనకు లడ్డూను అందజేశారు.