గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే హైదరాబాద్తో సహా తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుర్తొచ్చేది బాలాపూర్ విఘ్నేశ్వరుడు. తొలిసారి వినాయకుడి లడ్డూ వేలాన్ని ప్రారంభించిన బాలాపూరు గణేష్.
, ప్రతి ఏడాది వేలం పాటలో ధర పెరుగతూ కొత్త రికార్డును సృషిస్తోంది.వేలంపాటలో బాలాపూర్ గణేష్ లడ్డూను సొంతం చేసుకునేందుక భక్తులు పోటీ పడుతుంటారు.
మరోవైపు ఈ గణేష్ శోభాయాత్రకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది.బాలాపూర్ గణేష్ బయల్దేరిన తర్వాతే ఓల్డ్ సిటీలోని గణపతులు నిమజ్జనాలు బయల్దేరుతారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయం దగ్గర పడుతుండడంతో., కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఉత్సవాలను ఎలా నిర్వహిస్తారో అని భక్తుల్లో ఆసక్తి నెలకొంది.
అయితే ఈ క్రమంలో గురువారం సమావేశమైన బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ప్రతి ఏడాది ప్రతిష్టించే 21 అడుగుల విగ్రహానికి బదులుగా ఈ ఏడాది కేవలం ఆరు అడుగుల వినాయక విగ్రహాన్ని మాత్రమే తయారు చేయాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు.
అంతేకాక, ఈ ఏడాది లడ్డూ వేలం పాట నిర్వహించకూడదని కమిటీ నిర్ణయం తీసుకుంది.కరోనా దృష్ట్యా ఈ ఏడాది భక్తుల పూజలు, దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షడు కళ్లెం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.శోభాయాత్ర ప్రభుత్వ అనుమతుల మేరకు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చెప్పారు.
తమ కమిటీ నిర్ణయాలకు ప్రజలందరూ సహకరించాలని నిరంజన్ రెడ్డి కోరారు.