దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకసభ్యుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని ఆయన తనయుడు బాలకృష్ణ ఏ ముహూర్తాన ప్రకటించారో అప్పటి నుంచి ఆ వార్త అనేక సంచలనాలకు కారణమవుతోంది.ఎన్టీఆర్ జీవిత చరిత్రను మొత్తం చూపించాలని…అందులో ఎన్టీఆర్ను పదవి నుంచి చంద్రబాబు గద్దె దింపిన అంశాలను కూడా చూపించాలని బాబు, టీడీపీ వ్యతిరేకులు డిమాండ్ చేస్తున్నారు
ఈ క్రమంలోనే ఇదే అంశంపై ఎన్టీఆర్ కుమార్తె, బాలయ్య సోదరి అయిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి సైతం స్పందించారు.
ఎన్టీఆర్ను గద్దె దింపినప్పుడు ఆ కుట్రలో అందరూ పాత్రధారులే అని…అందులో బాలయ్య కూడా ఉన్నారని పురందేశ్వరి షాకింగ్ ప్రకటన చేశారు.అవన్నీ కూడా సినిమాలో చూపించాలని ఆమె చెప్పారు
ఈ విషయంలో ప్రజలకు అంతా తెలుసని…దాచాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు.
ఇక తన భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు సైతం వైస్రాయ్ హోటల్కు వెళ్లారని…తాను ఆయన్ను ఆపేందుకు ప్రయత్నించినా వినలేదని తన భర్త పాత్రను సైతం ఆమె రివీల్ చేశారు.ఈ సినిమాలో ఇవన్నీ చూపించినా కూడా తనకు అభ్యంతరం లేదన్నారు
ఇక ఎన్టీఆర్ రెండో పెళ్లి విషయం అంతా ఆయన ఇష్టప్రకారమే జరిగిందని…దీనిపై తాను స్పందించదలచుకోలేదని చెప్పారు.
ఇక వైస్రాయ్ హోటళ్లో ఎన్టీఆర్ను పదవి నుంచి దింపిన కుట్రలో చంద్రబాబు – బాలయ్య – హరికృష్ణ ఇంట్లో సమావేశమయ్యారని.తర్వాత వారు తన భర్త వెంకటేశ్వరరావును వైస్రాయ్ హోటల్కు తీసుకెళ్లారని ఆమె నాటి నిజాలను ఓపెన్గా చెప్పారు
ఇక నాడు జరిగిన నిజాలను ఉన్నది ఉన్నట్టు సినిమాలో చూపిస్తే ప్రజలు ఎన్టీఆర్ నిజజీవితంలో విలన్ ఎవరో స్పష్టంగా తెలుసుకుంటారని చెప్పారు.
సో పురందేశ్వరి మాటలను బట్టి చూస్తే ఆమె చంద్రబాబునే టార్గెట్గా చేసుకున్నట్టు కనిపిస్తోంది.