నందమూరి బాలకృష్ణపై ఇండియా టుడే తాజాగా ప్రత్యేక ఎడిషన్ను విడుదల చేసిన విషయం తెల్సిందే.దాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విడుదల చేయించారు.
ఇప్పుడు ఆ ప్రత్యేక ఎడిషన్పై విమర్శలు వస్తున్నాయి.సోషల్ మీడియాలో ఆ ఎడిషన్ గురించి పుకార్లు షికారు చేస్తున్నాయి.
కొంత కాలంగా ఇండియా టుడే తెలుగు వర్షన్ రావడం లేదు.ఈ సమయంలో బాలకృష్ణపై ప్రత్యేక ఎడిషన్ ఎలా వేశారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
పైగా ఆ ప్రత్యేక ఎడిషన్లు మార్కెట్లో ఎక్కడ కూడా దొరకడం లేదు.దాంతో ఇదంతా పబ్లిసిటీ కోసమే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో చిరంజీవి, మహేష్బాబు, పవన్ కళ్యాణ్, నాగార్జునల ప్రత్యేక ఎడిషన్ను ఇండియాటుడే విడుదల చేసింది.బాలయ్య వారికి ఏమాత్రం తగ్గడు అని నందమూరి అభిమానులు సొంత ఖర్చులతో ఇండియా టుడే ప్రత్యేక మ్యాగజైన్ను విడుదల చేయించినట్లుగా తెలుస్తోంది.
ఇందుకు బాలకృష్ణ సైతం తన వంతు సాయంను, కృషిని అందించాడు అంటూ ఫిల్మ్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది.ఇలా పబ్లిసిటీ కోసం పాడు పని చేసిన బాలయ్య అంటూ యాంటీ నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు.
ఈ విషయంలో కింది స్థాయి నందమూరి ఫ్యాన్స్ కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేయడం వల్ల బాలయ్య గౌరవం తగ్గుతుందని వారు అంటున్నారు.