ఎన్టీఆర్ బయోపిక్ తరువాత నందమూరి బాలకృష్ణ చాలా గ్యాప్ తీసుకున్నాడు.అసలైతే ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను ఎనౌన్స్ చేసే ఈ సీనియర్ హీరో తదుపరి సినిమాను పట్టాలెక్కించడానికి తెగ ఆలోచించాడు.
మొత్తానికి జై సింహా తో కమర్షియల్ హిట్టిచ్చిన కె.ఎస్.రవికుమార్ తోనే నెక్స్ట్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.
ఇక బీహార్ లో షూటింగ్ ని మొదలుపెట్టి వీలైనంత త్వరగా అన్ని షెడ్యూల్స్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేయాలని నిర్మాత సి.కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.అసలు విషయంలోకి వస్తే సినిమాలో బాలయ్యతో ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నారట.
పోలీస్ అండ్ గ్యాంగ్ స్టర్ గా బాలక్రిష్ణ ఇందులో కనిపించనున్నట్లు తెలుస్తోంది.అయితే సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సోనాల్ చౌహన్ ని ఒక హీరోయిన్ పాత్రకు సెలెక్ట్ చేసినట్లు టాక్.
ఇదివరకే ఈ బ్యూటీ బలయ్యతో కలిసి లెజెండ్ – డిక్టేటర్ సినిమాల్లో నటించింది.ఇక ఇప్పుడు మూడవసారి రూలర్ సినిమాలో కూడా బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకొనున్నట్లు సమాచారం.
ఇక మరో హీరోయిన్ ని కూడా సెలెక్ట్ చేసి డిసెంబర్ లో షూటింగ్ ని ఫినిష్ చేయాలని చూస్తున్నారు.ఫైనల్ గా సినిమా సంక్రాంతి బరిలో నిలబెట్టాలని బాలయ్య ప్లాన్.