నందమూరి నట వారసుడిగా కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో హిట్ చిత్రాలను అందించిన బాలకృష్ణ ఇటు సినిమాలలోనూ,అటు రాజకీయాల్లోనూ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు.అయితే ప్రస్తుతం బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా ద్వారా ఒక ఫోటోను తన అభిమానులతో పంచుకున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారి తన అభిమానులను ఆకట్టుకుంది.
ఇంతకు ఆ ఫోటోలో ఏముందంటే? బాలకృష్ణ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.అయితే తన పిల్లలతో దిగిన ఫోటోలు ఉండటం సహజమే అయినా, కానీ తాజాగా ఈ ఫోటోలో కనిపిస్తున్నట్లు వీరి లుక్ ప్రత్యేకంగా ఉండటంవల్ల అందరిని ఆకట్టుకుంటుంది.బాలకృష్ణ తన పిల్లలు మోక్షజ్ఞ, తేజస్విని, బ్రాహ్మణి చిన్న తనంలో ఉన్నప్పుడు వారిని వరుసగా తనపై కూర్చోబెట్టుకొని ఈ ఫోటోలో మనకు కనిపిస్తారు.
దీపావళి పండుగ సందర్భంగా బసవతారకం ఆసుపత్రిలో అంబులెన్సులను ప్రారంభించిన బాలకృష్ణ తాజాగా ఈ అరుదైన ఫోటో ను సోషల్ మీడియా వేదికగా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.ఈ ఫోటోను చూసిన అభిమానులు, తన అభిమాన నటుడితో చిన్నతనంలో ఉన్న తన పిల్లల్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపోతూ,ఆనందిస్తున్నారు.
ప్రస్తుతం బ్రాహ్మణి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ని వివాహం చేసుకొని, ప్రముఖ వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ ను నడుపుతున్నారు.తన రెండో కూతురు తేజస్విని భరత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.
అయితే నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.గత మూడు సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం వస్తుంది, కాకపోతే ఈ విషయంపై బాలకృష్ణ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.
ప్రస్తుతం బాలకృష్ణ తన 106వ చిత్రాన్నిబోయపాటి శీను దర్శకత్వంలో నటిస్తున్నట్లు సమాచారం.