నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’.ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.అందుకే ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా సంక్రాంతి 2023లో రిలీజ్ కాబోతుంది అని గత నెలలోనే ప్రకటించారు.
సంక్రాంతి సీజన్ లో రాబోతుంది అని చెప్పడంతో నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.సీజన్ చెప్పారు కానీ డేట్ ఇప్పటి వరకు ప్రకటించలేదు.
దీంతో సంక్రాంతి మూడు రోజుల్లో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మేకర్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఎదురు చూస్తున్న క్రమంలోనే ఈ రోజు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అఫిషియల్ గా అనౌన్స్ చేయడంతో పోటీ మరింత రసవత్తరంగా మారిపోయింది.
ఈ సినిమాను జనవరి 12న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్టుగా బాలయ్య మాసివ్ పోస్టర్ తో అనౌన్స్ చేసారు.దీంతో ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ వీడి పోయింది.
ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.సంక్రాంతి వంటి సీజన్ లో రసవత్తరమైన పోటీ మధ్య బాలయ్య సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి ఉండాల్సిందే.
ప్రెజెంట్ అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ వారం లోనే వీలైనంత వరకు షూటింగ్ పూర్తి చేయాలని కష్టపడుతున్నారు టీమ్.చూడాలి బాలయ్య అఖండ సక్సెస్ ను కొనసాగిస్తాడో లేదో.