నటసింహం నందమూరి బాలకృష్ణ వరస సినిమాలను లైన్లో పెట్టాడు.బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.
ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.ఈసారి రాబోతున్న హ్యాట్రిక్ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్నారు.
ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
బాలయ్య ఎప్పుడు లేని విధంగా కొత్త పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేయబోతున్నాడని ప్రకటించాడు.గోపీచంద్ మలినేని మాస్ రాజా రవితేజ తో తీసిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే బాలయ్య ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.
బాలయ్య కోసం గోపీచంద్ మలినేని ఒక పవర్ ఫుల్ కథతో సిద్ధం అయ్యాడు.ఈ సినిమాలో బాలకృష్ణ పల్నాటి ప్రాంతానికి చెందిన ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారని తెలుస్తుంది.ఈ సినిమా అఖండ సినిమా పూర్తి అవ్వగానే మొదలు పెట్టడానికి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారట.
అయితే ఇప్పుడు బాలకృష్ణ మరొక దర్శకుడితో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.దర్శకుడు శ్రీవాస్ డైరెక్షన్ లో ఒక యాక్షన్ డ్రామా సినిమాను చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాను సి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సి కళ్యాణ్ నిర్మించ బోతున్నారని టాక్ వినిపిస్తుంది.ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.