నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం అఖండ కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా రిజల్ట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ సినిమాతో వీరిద్దరి కాంబో హ్యాట్రిక్ విజయం కొడుతుందని నందమూరి అభిమానులు పూర్తి ధీమాగా ఉన్నారు.
అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రస్తుతం షూటింగ్ పనులు ముగించుకున్న ‘అఖండ’ డబ్బింగ్ పనులు ప్రారంభించింది.
ఈ క్రమంలోనే బాలయ్య తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభించాడు.కాగా ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తారనే టాక్ ఇటీవల వినిపించినా, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ మళ్లీ తేదీని మార్చినట్లు తెలుస్తోంది.
దసరా కానుకగా పలు చిత్రాలు పోటీ పడుతుండటంతో అఖండ చిత్రం రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో బాలయ్య స్వయంగా రిలీజ్ డేట్ను ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న అఖండ సినిమాను ఈసారి ఎలాగైనా రిలీజ్ చేయాలని బాలయ్య ధృడంగా భావిస్తున్నాడట.దీంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో త్వరలో ఓ క్లారిటీ రానుందని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, బాలయ్య సరసన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.ఈ సినిమాలో నటి పూర్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
కాగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మరి ఈ సినిమాను బాలయ్య ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నాడో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.