నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే.ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న బాలయ్య ఫ్యాన్స్కు తమిళ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ టార్చర్ అంటే ఏమిటో థియేటర్లో చూపించాడు.
రొటీన్ కథను తిప్పి తిప్పి చూపించడంతో బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూసేందుకు అనాసక్తి చూపించారు.
అయితే రూలర్ సినిమా ఎఫెక్ట్ బాలయ్య తరువాత సినిమాపై కూడా పడినట్లు తెలుస్తోంది.
బాలయ్య నెక్ట్స్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేశారు బాలయ్య.
అయితే ఈ సినిమా ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు.కాగా రూలర్ సినిమా దెబ్బకు ఈ సినిమా ఆగిపోనున్నట్లు తెలుస్తోంది.
రూలర్ చిత్రానికి దారుణమైన నెగెటివ్ టాక్ రావడంతో యాంటీ ఫ్యాన్స్తో పాటు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను తెగ ట్రోలింగ్ చేశారు.దీంతో బాలయ్య చాలా ఫీల్ అయినట్లు తెలుస్తోంది.కాగా ఇప్పుడు బోయపాటి శ్రీను చిత్రానికి ఏకంగా రూ.70 కోట్ల బడ్జెట్ కేటాయించడంతో ఆ బడ్జెట్ కూడా స్వాహా కావడం ఖాయమని ట్రోలర్స్ చెబుతున్నారు.దీంతో బాలయ్య ఈ సినిమాను క్యాన్సిల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందనే విషయం మాత్రం చిత్ర యూనిట్ తెలపాల్సి ఉంది.
.