నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ను ప్రారంభిచుకుని తొలి షెడ్యూల్ను కొంత మేర పూర్తి చేసుకుంది.మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో మరోసారి తమ కాంబో సూపర్ హిట్ అని నిరూపించుకోవాలని బాలయ్య చూస్తున్నాడు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను ఇటీవల రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.
బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడని చిత్ర యూనిట్ తెలిపింది.ఇక బాలయ్య ఈ సినిమాతో పాటు తనకు ఎంతో ఇష్టమైన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’ చిత్ర సీక్వెల్ను తెరకెక్కించాలని చూస్తున్నాడు.
గతంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని పలుమార్లు తెలిపిన బాలయ్య, ఇప్పుడు ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ రావు మరోసారి బాలయ్యను డైరెక్ట్ చేసి ఈ సినిమాతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాను నేటి ఆడియెన్స్కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.ఇక ‘ఆదిత్య 369’ వంటి క్లాసిక్ మూవీకి సీక్వెల్ అంటే ఈ సినిమా ఎలాంటి క్రేజ్ను దక్కించుకుంటుందో, ఆ క్రేజ్కు ఏమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ మూవీ ఉండనున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.
కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ను బాలయ్య చేయనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే సంగీతం ఈ సినిమా కథను పూర్తిగా రెడీ చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.