అనంతపురం జిల్లా హిందూపురం నందమూరి కంచు కోట, అప్పట్లో అన్నయ్య,ఆ తరువాత బాలయ్య ఇలా అక్కడ సైకిల్ దే హవా చెలరేగుతుంది.ప్రతి కూల పరిస్థితుల్లోనూ అక్కడ బాలయ్య తన హవా కొనసాగించారు.
గత ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గాలి భారీగా వీచినప్పటికీ బాలయ్య మాత్రం కంచుకోట లాంటి హిందూపురం లో నిలబడి విజయాన్ని అందుకున్నారు.రాయలసీమ లో టీడీపీ 3 సీట్లు గెలుచుకోగా అందులో హిందూపురం ఒకటి.
మరోవిశేషం ఏమిటంటే 2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ ఓట్లు సాధించారు.క్లిష్టపరిస్థితుల్లో కూడా హిందూపురం ప్రజలు బాలయ్య కే పట్టం కట్టారు.
అలాంటి హిందూపురం ప్రజలు ఇప్పుడు బాలయ్య బాబు కోసం ఎదురు చూస్తున్నారు.కరోనా నేపథ్యంలో గత కొద్దీ నెలలుగా బాలయ్య బాబు టెలిఫోనిక్ ద్వారానే సందేశాలు ఇస్తున్నారు.
ఫోన్ తప్పా సీన్ లోకి రావడం లేదు అంటూ క్యాడర్ కూడా ఆవేదన చెందుతుంది.ఇప్పటికే హిందూపురం ను జిల్లా కేంద్రం గా చేయాలి అని తమ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ పెట్టాలి అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ ద్వారా విన్నవించిన బాలయ్య డైరక్ట్ గా సీన్ లోకి రాకపోవడం గమనార్హం.
తమ ఎమ్మెల్యే ఫోన్ లో తప్పించి కంటికి ఒక్కసారైనా కనిపించడం లేదు అంటూ నియోజక వర్గ వాసుల ఆవేదన.మరోపక్క ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బాలయ్య సీన్ లోకి వస్తేనే పార్టీకి బూస్ట్ అని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.
అయితే బాలయ్య మాత్రం కేవలం టెలిఫోనిక్ సందేశాలు మాత్రమే ఇస్తూ పార్టీ క్యాడర్ కు దూరంగానే ఉంటున్నారు.
దీనితో నియోజక ప్రజలు మాత్రం లేఖలు సరే సార్… ఒక్కసారి వచ్చి పోరు అంటున్నారు.
పార్టీ అధికారంకి దూరం అయితే ఏంటి నియోజక ప్రజల కోసం ఆయన హిందూపురం కి రావాలి అంటూ నియోజక వర్గ ప్రజలు కోరుకుంటున్నారు.మరి బాలయ్య మాత్రం ఇలా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు.
మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.