వామ్మో నీకో దండం అంటున్న బాలయ్య... ఇకపై దాని జోలికి వెళ్లడట

నందమూరి బాలకృష్ణ ఎంతో ఆశపడి, కష్టపడి నటించి, నిర్మించిన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ మరియ ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి.100 కోట్లు సాధిస్తాయని ఆశపడ్డ సినిమాలు కనీసం 25 కోట్లు కూడా రాబట్టలేక పోయాయి.నిర్మాత బాలకృష్ణ ఈ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకుని 60 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లుగా సమాచారం అందింది.భారీ లాస్‌ రావడంతో పాటు, చాలా ఆశ పెట్టుకున్న సినిమా నిరాశ పర్చడంతో బాలయ్య చాలా డిస్సప్పాయింట్‌ అయ్యాడు.

 Balakrishna Stops Producing Films-TeluguStop.com

అందుకే ఇకపై నిర్మాతగా అస్సలు ట్రై చేయవద్దని నిర్ణయించుకున్నాడు

నిర్మాతగానే కాకుండా నటుడిగా కూడా ఆచి తూచి అడుగులు వేయాలని భావిస్తున్నాడు.బాలయ్య కెరీర్‌లో ఇప్పటి వరకు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు.

అయితే ఇప్పుడు మాత్రం కాస్త ఆలోచనలో పడ్డాడు.బాలయ్య తదుపరి చిత్రంకు చాలా నెలలు సమయం పడుతుంది.

ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో సినిమా అని కన్ఫర్మ్‌ అయ్యింది.అయితే అది ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ప్రారంభం అయ్యి, వచ్చే వేసవిలో విడుదల అవ్వబోతుంది.

అంటే సమయం సంవత్సరం పడుతుంది.
ఇంత సమయం తీసుకుంటున్న బాలయ్య ఈసారి తప్పకుండా ఘన విజయాన్ని సొంతం చేసుకుంటాడా అంటే నందమూరి అభిమానులు బల్లగుద్ది మరీ అవును అంటున్నారు.

తప్పకుండా సింహా, లెజెండ్‌ స్థాయిలో మరోసారి బోయపాటి బాలయ్యకు సినిమా ఇస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను త్వరలోనే ప్రకటిస్తాను అంటూ బోయపాటి ఇటీవలే ప్రకటించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube