మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని దేశంలోని పలు శివాలయాలలో పెద్ద ఎత్తున ఆ పరమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు.ఈ నేపథ్యంలోనే సినీ నటుడు, రాజకీయ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు.
మహాశివరాత్రి సందర్భంగా బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధర అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో పాపనాశేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.
శివరాత్రి సందర్భంగా ఉదయాన్నే లేపాక్షి ఆలయానికి చేరుకున్న బాలకృష్ణ దంపతులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఆలయాన్ని సందర్శించిన బాలకృష్ణ దంపతులు స్వామివారి మూలవిరాట్టును దర్శించుకొని కుంకుమార్చన వంటి తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.అనంతరం ఆలయ అధికారులు ఎమ్మెల్యే బాలకృష్ణకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
మహాశివరాత్రి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.స్వామివారి దర్శనం అనంతరం నియోజకవర్గంలో బాలకృష్ణ పర్యటించారు.
హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలవడం ఇది ఇది రెండవసారి.
ఒకవైపు రాజకీయాలలో ఉంటూ మరోవైపు సినిమా ఇండస్ట్రీలో సినిమాలను చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ప్రస్తుతం బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇదివరకే బాలకృష్ణ ,బోయపాటి శ్రీను దర్శకత్వంలో లెజెండ్, సింహా వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించారు.వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా.
ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో, వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూడవ సినిమాపై బాలయ్య అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్ లు విడుదల అయ్యాయి.అందులో బాలకృష్ణ లుక్ కొత్తగా ఉండటంతో నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అంతే కాకుండా ఈ సినిమా గురించి తాజా సమాచారం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.