నందమూరి బాలకృష్ణ సినిమా హిట్ అయ్యి చాలా నెలలు అవుతుంది.ఈయన ఏ సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూనే ఉంది.
దాంతో ఈసారి చాలా నమ్మకం పెట్టుకుని బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాకు రెడీ అయ్యాడు.ఇప్పటికే తనకు సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన బోయపాటి శ్రీనుపై బాలకృష్ణ చాలా నమ్మకంగా ఉన్నాడు.
వీరిద్దరి కాంబోలో ఇది హ్యాట్రిక్ అనుకుంటూ ఉన్న సమయంలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ప్రస్తుతం షూటింగ్ జరగడం లేదు.
త్వరలోనే మళ్లీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వారణాసి, కాశీల్లో సినిమా షూటింగ్ చేయాలనుకున్నారు.
కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ షూటింగ్కు సాధ్యం కాదని అందుకే తెలుగు రాష్ట్రాల్లోనే సినిమాను పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.సినిమా మెజార్టీ పార్ట్ వారణాసిలో ఉంటుందని అన్నారు.
కాని ఇప్పుడు షూటింగ్ అక్కడ చేయకపోవడంతో కథలో మార్పు చేయాల్సి రావచ్చు అంటున్నారు.
సినిమా ప్రారంభం సమయంలోనే వారణాసి బ్యాక్ డ్రాప్ అన్నారు.కనుక సినిమా షూటింగ్ అక్కడే ఎక్కువగా ఉంటుందనుకున్నారు.కాని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ చేయాలి అంటే కథలో మార్పు చేయాల్సి ఉంటుందట.
కథలో మార్పు చేస్తే ఫలితం ఏమవుతుందో అనే టెన్షన్ను నందమూరి ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు కరోనా పెద్ద దెబ్బ కొట్టబోతున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.