నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుకాగా ప్రస్తుతం ఈ షూటింగ్ను శరవేగంగా జరుపుతున్నారు.
ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.కాగా అందులో బాలయ్య ఓ పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా, మరొకటి అఘోరా పాత్ర అని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా షూటింగ్ను ప్రస్తుతం గుంటూరులో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.సినిమాలో బాలయ్యకు సంబంధించిన ఓ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ను ఇక్కడ చిత్రీకరించేందుకు బోయపాటి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.
సహజసిద్ధమైన అందాల నడుమ ఈ షూటింగ్ జరపాలని వారు భావిస్తున్నారు.అందుకే గుంటూరులోని కొన్ని ప్రాంతాలను వారు ఎంపిక చేశారట.మరి గుంటూరులో బాలయ్య ఫ్లాష్బ్యాక్ ఏమై ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాలో అఘోరా పాత్రలో బాలయ్య పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి కూడా సర్వత్రా నెలకొంది.
కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా అందాల భామలు ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.కానీ చిత్ర యూనిట్ మాత్రం ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు.
మరి వారిద్దరు నిజంగానే ఈ సినిమాలో నటిస్తున్నారా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
వేసవి బరిలో పలు భారీ చిత్రాలు రిలీజ్ అవుతుండటంతో వాటికి బాలయ్య ఎలాంటి పోటీని ఇస్తాడా అనేది సినీ జనాల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది.మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తు్న్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.