ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో దూసుకుపోతూ ఉంటే, ఇక ఆ పార్టీ నేతలు మాత్రం చంద్రబాబు ఇమేజ్ ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు.ముఖ్యంగా చంద్రబాబు భావమరిది హీరో బాలకృష్ణ మాత్రం తన ఎన్నికల ప్రచారంలో మాటిమాటికి సహనం కోల్పోతూ ఎవరి మీద పడితే వారి మీద సీరియస్ అవడం, వార్నింగ్ ఇవ్వడం, అంతకు మించి కొట్టడం చేస్తున్నాడు.
తాను కొడితే తన ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు అంటూ అప్పట్లో ఆసక్తికరమైన వాఖ్యలు చేసిన బాలకృష్ణ ఇప్పుడు అదే పనిగా అభిమానులు, కార్యకర్తల మీద చేయి చేసుకోవడం విశేషం.
బాలయ్య ప్రవర్తన వలన ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా హిందూపురంలో అతని ఇమేజ్ దారుణంగా దెబ్బ తిన్నదని, అక్కడి ప్రజలు బాలకృష్ణ ప్రవర్తనని అసహించుకుంటున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.తాజాగా హిందూపురంలో మరోసారి టీడీపీ అభిమానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.హిందూపురం నియోజకవర్గంలో భార్య వసుంధరతో కలిసి బాలకృష్ణ ఎన్నికల ప్రచార రథంపై వెళుతుండగా ఓ కార్యకర్త, ఈ ఎన్నికల్లో మీకు వేలల్లో మెజారిటీ వస్తుంది అంటూ అరిచాడు.
మరో కార్యకర్త ఈసారి 60వేల మెజారిటీ అంటూ కేకలు వేశాడు.దీంతో బాలయ్యకు కోపం వచ్చింది.
ఫ్యాన్స్ చేసిన హంగామాకి కోపంతో ఊగిపోయిన బాలకృష్ణ ఇలా హైప్ క్రియేట్ చేసిన వారికి పీక కోయాలి అంటూ భార్యతో చెబుతూ అభిమాని వైపు చూస్తూ ఒరేయ్ నీ పేరు, అడ్రెస్స్ చెప్పరా, ఏమైనా గెలవకపోతే ఇంటికి వచ్చి నరుకుతా నా కొడకా అంటూ వార్నింగ్ ఇచ్చాడు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.ఫ్యాన్స్ మీద, టీడీపీ కార్యకర్తల మీద బాలకృష్ణ నోటి దూలతో చేస్తున్న విమర్శల కారణంగా వారిలో అసహనం పెరిగిపోతుంది అంటూ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.